జిల్లాకు లక్ష డోసులు
ABN , First Publish Date - 2021-07-25T06:18:49+05:30 IST
జిల్లాకు లక్ష కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వస్తాయని డీఎంహెచ్వో డా.బి.రామగిడ్డయ్య వెల్లడించారు.
కర్నూలు(హాస్పిటల్), జూలై 24: జిల్లాకు లక్ష కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వస్తాయని డీఎంహెచ్వో డా.బి.రామగిడ్డయ్య వెల్లడించారు. రెండో డోసు వేసుకునేవారు బాలింతలు, గర్భిణులు, విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన ప్రోగ్రాం ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై చివర్లో రెండో డోసు వేసుకునే వారి సంఖ్య 70 వేల దాకా ఉందని, వీరికి సోమవారం నుంచి టీకాలు వేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వీరితో పాటు 38వేల మంది గర్భిణులు, 10వేల మంది బాలింతలు ఉన్నారన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె.ప్రవీణ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కార్యకర్త రోజుకు ఒక గర్భిణికి వ్యాక్సిన్ వేయించుకునేలా లక్ష్యం పెట్టుకోవాలన్నారు.