Srisailam జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు
ABN , First Publish Date - 2021-11-23T14:08:49+05:30 IST
జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనగుతోంది.
![Srisailam జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921112308365269/11232021083832n88.jpg)
కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 1,26,462 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,9,12 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 862.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను...ప్రస్తుత 114.9952 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. మరోవైపు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.