కర్నూలు జిల్లా: చెంచులను మోసం చేసిన ఓ ప్రైవేట్ సంస్థ
ABN , First Publish Date - 2021-10-31T15:52:37+05:30 IST
ఆత్మకూరు మండలంలోని చెంచులను ఓ ప్రైవేట్ సంస్థ నిలువునా మోసం చేసింది.
![కర్నూలు జిల్లా: చెంచులను మోసం చేసిన ఓ ప్రైవేట్ సంస్థ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు జిల్లా: ఆత్మకూరు మండలంలోని చెంచులను ఓ ప్రైవేట్ సంస్థ నిలువునా మోసం చేసింది. గొలుసు కట్టు పద్దతిలో ముగ్గురిని చేర్పిస్తే రూ. 900, కొత్తగా చేరే ప్రతి సభ్యుడిపై రూ. 500 వస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు నమ్మించారు. అలా ఒక్కొక్కరి నుంచి రూ. 12,800 కట్టించుకున్నారు. సభ్యులు కట్టిన సొమ్ముకు వారం వారం డబ్బులు ఇస్తామని చెప్పి సంస్థ ప్రతినిధులు పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఎక్కువ మంది ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన చెంచులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.