Kurnool: సంఘంలో సభ్యత్వంలేదంటూ శవాన్ని అడ్డుకున్న పెద్దలు

ABN , First Publish Date - 2021-12-31T17:10:14+05:30 IST

జిల్లాలోని మిడ్తూర్ మండలం కడుమురులో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో అనసూయమ్మ(73) అనే మహిళ మృతి చెందింది.

Kurnool: సంఘంలో సభ్యత్వంలేదంటూ శవాన్ని అడ్డుకున్న పెద్దలు

కర్నూలు: జిల్లాలోని  మిడ్తూర్ మండలం  కడుమురులో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో అనసూయమ్మ(73) అనే మహిళ మృతి చెందింది. మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు బంధువులు స్మశానవాటికకు తీసుకెళ్లగా సంఘం పెద్దలు అడ్డుకున్నారు. సంఘంలో సభ్యత్వం తీసుకుంటేనే మృతదేహాన్ని స్మశానంలోకి అనుమతిస్తామని తేల్చిచెప్పారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  సంఘ పెద్దలకు, మృతురాలి బంధువులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు అక్కడకు చేరుకుని  మృతురాలి కొడుకుకు నచ్చజెప్పి  సభ్యత్వం కట్టించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు శవాన్ని అడ్డుకున్న 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-12-31T17:10:14+05:30 IST