Kurnoolలో 23 కేజీల వెండి బిస్కెట్‌లు స్వాధీనం

ABN , First Publish Date - 2021-08-20T18:15:17+05:30 IST

జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో వెండి బిస్కెట్‌లు పట్టుబడ్డాయి.

Kurnoolలో 23 కేజీల వెండి బిస్కెట్‌లు స్వాధీనం

కర్నూలు: జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో వెండి బిస్కెట్‌లు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 23 కేజీల బరువు గల వెండి బిస్కెట్‌లు, రూ.11.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-08-20T18:15:17+05:30 IST