నాటు వైద్యం వికటించి బాలుడు మృతి
ABN , First Publish Date - 2021-01-22T12:51:51+05:30 IST
జిల్లాలోని క్రిష్ణగిరి మండలం టి.గోకులపాడులో విషాదం చోటు చేసుకుంది. నాటు వైద్యం వికటించి ఏడేళ్ల బాలుడు రాఘవేంద్ర మృతి చెందాడు.
కర్నూలు: జిల్లాలోని క్రిష్ణగిరి మండలం టి.గోకులపాడులో విషాదం చోటు చేసుకుంది. నాటు వైద్యం వికటించి ఏడేళ్ల బాలుడు రాఘవేంద్ర మృతి చెందాడు. పుట్టుకతోనే మూగ బాలుడు కావడంతో తల్లిదండ్రులు నాటు వైద్యులను ఆశ్రయించారు. అయితే వైద్యం చేసిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడు కాసేపటికే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.