బయల్పడుతున్న ఆలయ గోపురం
ABN , First Publish Date - 2021-03-01T05:30:00+05:30 IST
శ్రీశైలం వెనకతట్టు జలాలు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతుండటంతో సప్త నదుల సంగమేశ్వర ఆలయ గోపురం కృష్ణా జలాల నుంచి బయల్పడుతోంది.
కొత్తపల్లి, మార్చి 1: శ్రీశైలం వెనకతట్టు జలాలు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతుండటంతో సప్త నదుల సంగమేశ్వర ఆలయ గోపురం కృష్ణా జలాల నుంచి బయల్పడుతోంది. సోమవారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయ నీటి మట్టం 856.30 అడుగులకు చేరుకోవడంతో 95.36 టీఎంసీలుగా నమోదైంది. దీంతో సంగమేశ్వర ఆలయ గోపురం కృష్ణా జలాలను వీడి మెల్లగా బయల్పడుతూ భక్తులకు దర్శన మిస్తోంది.