కొవిడ్‌ జీరో

ABN , First Publish Date - 2021-11-22T05:03:59+05:30 IST

గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 2,049 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కొవిడ్‌ జీరో


 కర్నూలు(హాస్పిటల్‌), నవంబరు 21: గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 2,049 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగిటివ్‌ వచ్చింది. జిల్లాలో ఆదివారం ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు జిల్లాలో 1,24,178 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో ఆసుపత్రులు, హోం ఐసొలేషనలో 8 మంది చికిత్స పొందుతున్నారు. 1,23,316 మంది కోలుకున్నారు.


Updated Date - 2021-11-22T05:03:59+05:30 IST