948 మందికి వైరస్
ABN , First Publish Date - 2021-05-11T05:17:16+05:30 IST
జిల్లాలో సోమవారం 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
600 దాటిన మరణాలు
కర్నూలు(హాస్పిటల్), మే 10: జిల్లాలో సోమవారం 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 రోజుల్లో 53 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 601కి చేరింది. ఇప్పటి వరకు 15,724 మంది కరోనా బారిన పడ్డారు. సోమవారం మరో ఆరుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. యాక్టివ్ కేసులు 9,717కు చేరగా.. 83,328 మంది డిశ్చార్జి అయ్యారు.