కొలనుభారతిలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-02-27T05:06:45+05:30 IST

కొలను భారతి క్షేత్రంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సరస్వతి అమ్మవారికి కాకనూరు శారదా జ్ఞాన పీఠాధిపతులు శివయోగేంద్ర సరస్వతి స్వామీజీల ఆధ్వర్యంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు.

కొలనుభారతిలో ప్రత్యేక పూజలు

కొత్తపల్లి, ఫిబ్రవరి 26: కొలను భారతి క్షేత్రంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సరస్వతి అమ్మవారికి కాకనూరు శారదా జ్ఞాన పీఠాధిపతులు శివయోగేంద్ర సరస్వతి స్వామీజీల ఆధ్వర్యంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అమ్మవారికి నూతన వస్త్ర అలంకరణ, పంచా మృతాభిషేకం, కుంకుమార్చన పుష్పార్చన తదితర పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారి సన్నిధిలో లక్ష్మీ గణపతి, సరస్వతి, రుద్ర, లక్ష్మీ నారాయణ హోమా లు స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా స్వామీజీకి పురోహితులు పూర్ణకుంభస్వాగతం పలికారు. దుద్యాల భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్క భజన, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టు కున్నాయి. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే సింగరాజుపల్లి గ్రామ శివార్ల లోని సద్గురు సరస్వతి నారాయణ స్వామి ఆశ్రమంలో విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర ్వహించారు.

Updated Date - 2021-02-27T05:06:45+05:30 IST