కర్ణాటక మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-07-25T06:00:27+05:30 IST
మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు కూడలిలో హెచ్. కైరవాడి గ్రామస్థులు కర్ణాటక మద్యం అమ్ముతుండగా పట్టుకున్నట్లు సీఐ మంజూనాఽథ్, ఎస్ఐ సురేష్ తెలిపారు.
గోనెగండ్ల, జూలై 24: మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు కూడలిలో హెచ్. కైరవాడి గ్రామస్థులు కర్ణాటక మద్యం అమ్ముతుండగా పట్టుకున్నట్లు సీఐ మంజూనాఽథ్, ఎస్ఐ సురేష్ తెలిపారు. బాలగౌడ్, హరిగౌడ్ హోటల్ నిర్వహిస్తూ కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో శనివారం సోదాలు నిర్వహించగా సుమారు రూ.70,000 వేల మద్యం లభ్యమైందని తెలిపారు. అరెస్టు చేసి వారి వద్ద ఉన్న మారుతి కారును సీజ్ చేశామని చెప్పారు. అలాగే హెచ్.కైరవాడి గ్రామానికి చెందిన వడ్డె కుంటి గోపాల్ నుంచి కూడా కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశామని చెప్పారు.