కర్ణాటక మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-01-14T04:11:03+05:30 IST
మండలంలోని చింతకుంట బస్టాండు వద్ద అక్రమంగా తరలిస్తున్న భారీ కర్ణాటక మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని ఆదోని డీఎస్పీ వినోద్కుమార్ వెల్లడించారు.
![కర్ణాటక మద్యం పట్టివేత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హాలహర్వి, జనవరి 13: మండలంలోని చింతకుంట బస్టాండు వద్ద అక్రమంగా తరలిస్తున్న భారీ కర్ణాటక మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని ఆదోని డీఎస్పీ వినోద్కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 2640 మద్యం బాటిల్స్ను కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా నుంచి హాలహర్వి మీదుగా, గుంతకల్లు మీదుగా తరలిస్తుండగా చింతకుంట వద్ద రెండు స్కార్పియోలను స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్టు చేశామన్నారు.