శ్రీశైలంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2021-11-22T05:14:58+05:30 IST
భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆదివారం రాత్రి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. దేవ్దాస్ దర్శించుకొన్నారు.

శ్రీశైలం, సెప్టెంబరు 21: భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆదివారం రాత్రి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. దేవ్దాస్ దర్శించుకొన్నారు. దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఆయనకు వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.