అగ్రిగోల్డ్ భూములపై విచారణ
ABN , First Publish Date - 2021-09-04T05:27:22+05:30 IST
మండలంలోని క్రిష్ణగిరి, రామక్రిష్ణాపురం, తొగర్చేడు గ్రామాలలోని 430 ఎకరాల అగ్రిగోల్డ్ భూములపై సీఐడీ డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు శుక్రవారం విచారణ చేపట్టారు.

క్రిష్ణగిరి, సెప్టెంబరు 3: మండలంలోని క్రిష్ణగిరి, రామక్రిష్ణాపురం, తొగర్చేడు గ్రామాలలోని 430 ఎకరాల అగ్రిగోల్డ్ భూములపై సీఐడీ డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు శుక్రవారం విచారణ చేపట్టారు. వీఆర్వో గిడ్డయ్యతో కలిసి సర్వే నెంబర్ల వారిగా పొలాల దగ్గర విచారణ చేపట్టారు. సర్వే వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని వారు తెలిపారు.