ముత్తుకూరులో 30 మందికి అస్వస్థత

ABN , First Publish Date - 2021-10-19T05:47:04+05:30 IST

ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో 30 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

ముత్తుకూరులో 30 మందికి అస్వస్థత

  1. రెండు రోజులుగా ఇదే పరిస్థితి
  2. కలుషిత నీరే కారణమంటున్న గ్రామస్థులు


ఆదోని(ఆస్పరి), అక్టోబరు 18: ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో 30 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా గ్రామంలో వాంతులు, విరేచనాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తొమ్మిది మంది ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు వెళ్లారు. మంచినీటి పైపులైను మురుగు నీటి కాలువలో లీక్‌ కావడంతో ఈ పరిస్థి తలెత్తిందని గ్రామస్థులు అంటున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. ఆదోని ఏరియా ఆసుపత్రిలో రాజమ్మ, పక్కీరప్ప, రాజేంద్ర, లక్ష్మిదేవి, రంగమ్మ, రామలక్ష్మి, రాజు, పులికొండ, జగదీష్‌ చికిత్స పొందుతున్నారు. 


రెండు రోజులుగా ఇదే పరిస్థితి: పక్కీరప్ప


రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాను. సోమవారం వాంతులు ఎక్కువ కావడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాను. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. 

Updated Date - 2021-10-19T05:47:04+05:30 IST