‘పురోహితులకు గుర్తింపు కార్డులివ్వాలి ’
ABN , First Publish Date - 2021-05-11T05:28:45+05:30 IST
వైశాఖ మాసంలో తెల్లవారుజామున శుభముహుర్తాలు ఎక్కువగా ఉన్నందువల్ల పురోహితులకు కొవిడ్ నిబంధనల మేరకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ కోరారు.
ఆదోని, మే 10: వైశాఖ మాసంలో తెల్లవారుజామున శుభముహుర్తాలు ఎక్కువగా ఉన్నందువల్ల పురోహితులకు కొవిడ్ నిబంధనల మేరకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ కోరారు. ఆదోని పట్టణంలో మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య లాక్డౌన్ అమలు జరుగుతున్న సమయం కాబట్టి అధికారులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశాయి, కమలనాభశర్మ, మధుసూదనరావు, గుడిపల్లి సత్యనారాయణశర్మ, సదాశివశర్మ పాల్గొన్నారు.