‘రోగులకు నాణ్యమైన భోజనం అందించండి’

ABN , First Publish Date - 2021-12-09T05:19:14+05:30 IST

రోగులకు, గర్భిణులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.జి. నరేంద్రనాథ్‌ రెడ్డి కొత్త డైట్‌ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

‘రోగులకు నాణ్యమైన భోజనం అందించండి’

కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 8: రోగులకు, గర్భిణులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.జి. నరేంద్రనాథ్‌ రెడ్డి కొత్త డైట్‌ కాంట్రాక్టర్‌ను  ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఏఆర్‌ఎంవోలు డా.శివప్రసాద్‌ రెడ్డి, డా.వెంకటరమణతో కలిసి ఆయన డైట్‌ కేంద్రాన్ని, రోగులకు పెడుతున్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైట్‌ విభాగంలోని పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో కాంట్రాక్టరుపై మండిపడ్డారు. ప్రతిరోజూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న ఆక్సిజన్‌ సరఫరా, ఆక్సిజన్‌ ఫ్లో సామర్థ్యాన్ని తనిఖీ చేశారు. థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ఆసుపత్రిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్‌ తెలిపారు. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌ డా.శివబాల, పల్మనాలజి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.శ్రీధర్‌రావు, సర్జంట్‌ వేణుగోపాల్‌ ఉన్నారు.


Updated Date - 2021-12-09T05:19:14+05:30 IST