వన్ ఆర్ తూమ్ కాల్వలో హిజ్రా మృతి
ABN , First Publish Date - 2021-04-18T04:57:18+05:30 IST
వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు అనుసంధాంగా వున్న వన్ ఆర్ తూము కాల్వలో ప్రమాదవశాత్తు అలకనంద అలియాస్ రాజు(22) అనే హిజ్రా మృతి చెందింది.
ఆత్మకూరు(వెలుగోడు),
ఏప్రిల్ 18: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు అనుసంధాంగా వున్న
వన్ ఆర్ తూము కాల్వలో ప్రమాదవశాత్తు అలకనంద అలియాస్ రాజు(22) అనే హిజ్రా
మృతి చెందింది. వెలుగోడు ఎస్సై చిన్నపీరయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలుకు చెందిన అలకనంద తన స్నేహితులతో కలిసి ఈ నెల 15వ తేదిన వెలుగోడు
రిజర్వాయర్ సందర్శనకు వచ్చారు. అక్కడే వున్న వన్ఆర్ తూములో ఈత కొడుతూ..
సంతోషంగా గడిపారు. అయితే ప్రమాదవశాత్తు అలకనంద నీటిలో కొట్టుకుపోయి
అదృశ్యమమైంది. అయితే అప్పటికే అలకనంద తనకు ఆయాసంగా ఉందని చెప్పడంతో ఇంటికి
వెళ్లిపోయి వుంటాదని స్నేహితులు భావించారు. కానీ శనివారం గుంతకందాల రస్తా
సమీపంలోని వన్ఆర్ తూము కాల్వలో అలకనంద మృతదేహం తేలియాడితూ కనిపించింది.
స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి
చేరుకుని మృతురాలి ఆచూకీ గుర్తించి ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ
మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిన్నపీరయ్య
తెలిపారు.