20 కొత్త పీహెచ్సీల మంజూరు
ABN , First Publish Date - 2021-10-26T05:09:18+05:30 IST
గ్రామీణ వైద్యం విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేస్తూ వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా.గీతాప్రసాదిని ఉత్తర్వులు జారీ చేశారు.

కర్నూలు(హాస్పిటల్), అక్టోబరు 25: గ్రామీణ వైద్యం విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేస్తూ వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా.గీతాప్రసాదిని ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు 20 పీహెచ్సీలను మంజూరు చేసింది. పేద గ్రామీణ ప్రాంతంలో మెరుగైన సేవలు అందించేందుకు కొత్త పీహెచ్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు డీహెచ్ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద కందుకూరు (ఆళ్లగడ్డ మండలం), ముత్యాలపాడు (చాగలమర్రి), ములుగుందం (ఆస్పరి), నేమకల్లు (చిప్పగిరి), తెర్నేకల్ (దేవనకొండ), భానుముక్కల (పాములపాడు), అక్కిరెడ్డిపల్లె (కొలిమిగుండ్ల), కె.నాగులాపురం (గూడూరు), కందుకూరు (కోసిగి), మాధవరం (మంత్రాలయం), హెచ్.మురవణి (పెద్దకడుబూరు), అల్లూరు (నందికొట్కూరు), పెసరవాయి (గడివేముల), భూపనపాడు (పాణ్యం), చిట్యాల (కృష్ణగిరి), పెరవలి (మద్దికెర), హఠకేశ్వరం (శ్రీశైలం), పెద్దనేలటూరు (గోనెగండ్ల), గోవర్ధనగిరి, రామళ్లకోట (వెల్దుర్తి మండలం)కు మంజూరయ్యాయి.