‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి’
ABN , First Publish Date - 2021-10-30T04:32:59+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ పూర్తిగా అందేలా చూడాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.
వెల్దుర్తి, అక్టోబరు 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ పూర్తిగా అందేలా చూడాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. మండలంలోని చెరుకులపాడు గ్రామంలో సిటిజన్ అవుట్ రీసర్వేని ఆయన పరిశీలించారు. అనంతరం వెల్దుర్తి పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో సుబ్బారెడ్డి, ఈవోఆర్డీ నరసింహులు ఉన్నారు.