జీడీపీ ఎత్తు పెంచితే భూములు ఇవ్వం
ABN , First Publish Date - 2021-11-23T05:40:56+05:30 IST
గాజులదిన్నె ప్రాజెక్టు ఎత్తు పెంచేటట్లయితే తమ భూములు ఇవ్వబోమని గంజహళ్లి, బెల్లదొడ్డి, ఐరన్బండ, ఎన్నెకండ్ల, నెరుడుప్పల ఆయకట్టు భూముల రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు.
![జీడీపీ ఎత్తు పెంచితే భూములు ఇవ్వం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- కలెక్టర్కు తెలియజేసిన ఆయకట్టు రైతులు
గోనెగండ్ల, నవంబరు 22: గాజులదిన్నె ప్రాజెక్టు ఎత్తు పెంచేటట్లయితే తమ భూములు ఇవ్వబోమని గంజహళ్లి, బెల్లదొడ్డి, ఐరన్బండ, ఎన్నెకండ్ల, నెరుడుప్పల ఆయకట్టు భూముల రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు. వారు సోమవారం కర్నూలు కలెక్టర్ను కలసి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు నజీర్సాహెబ్ మాట్లాడుతూ 1970లో గాజులదిన్నె ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ గ్రామాలకు చెందిన 3వేల ఎకరాలను ఇచ్చామన్నారు. దానికి పరిహారం కింద ప్రభుత్వం రూ.500 నుంచి రూ.1000 వరకు ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు. ఈ ఐదు గ్రామాల రైతులు మిగిలిన 150 నుంచి 200 ఎకరాలలో పంటలు పండించుకొని జీవిస్తున్నారని అన్నారు. మళ్లీ ఆనకట్ట ఎత్తు పెంచితే ఈ భూములు ముంపునకు గురవుతాయని అన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆనకట్ట పెంచేటట్లయితే భూములు ఇవ్వబోమని అన్నారు. అలాగే జీవో నెం 98 ప్రకారం నిర్వాసితుల్లో ప్రతి ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.