బాలిక కిడ్నాప్
ABN , First Publish Date - 2021-12-26T05:32:03+05:30 IST
మంత్రాలయం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కిడ్నాప్కు గురైనట్లు మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాల్ రాజు తెలిపారు. బాలిక తల్లి మృతి చెందింది.
![బాలిక కిడ్నాప్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మంత్రాలయం, డిసెంబరు 25: మంత్రాలయం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కిడ్నాప్కు గురైనట్లు మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాల్ రాజు తెలిపారు. బాలిక తల్లి మృతి చెందింది. ఈ నెల 24న శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసినట్లు తండ్రి మంత్రాలయం పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.