సుంకేసులకు వరద

ABN , First Publish Date - 2021-10-11T05:42:40+05:30 IST

తుంగభద్ర నదీ ప్రవాహంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరద పోటెత్తింది.

సుంకేసులకు వరద

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 10: తుంగభద్ర నదీ ప్రవాహంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి సుంకేసుల జలాశయానికి 41,250 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ జలాశయం 9గేట్లు ఎత్తి 39,800 క్యూసెక్కుల నీటిని దిగవకు నదిలోకి వదులుతున్నట్లు నీటి పారుదల శాఖ మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది ఒడ్డుకు రావద్దని ఎస్‌ఈ సూచించారు.

Updated Date - 2021-10-11T05:42:40+05:30 IST