‘ఫీజుల దోపిడీని అరికట్టాలి’

ABN , First Publish Date - 2021-08-22T04:46:09+05:30 IST

పట్టణం లోని మాచాని సోమప్ప ఎయిడెడ్‌ ఉన్నత పాఠ శాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు రంగస్వామి, విజేంద్ర డిమాండ్‌ చేశారు

‘ఫీజుల దోపిడీని అరికట్టాలి’

ఎమ్మిగనూరు టౌన్‌, ఆగస్టు 21: పట్టణం లోని మాచాని సోమప్ప ఎయిడెడ్‌ ఉన్నత పాఠ శాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు రంగస్వామి, విజేంద్ర డిమాండ్‌ చేశారు. శనివారం పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందాలన్న లక్ష్యంతో పద్మశ్రీ మాచాని సోమప్ప పాఠశాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు ఉన్న వాళ్లకే చదువు అనే మాదిరిగా తయారైందని, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రామాంజినేయులు, రవి, ఖాజా, నూర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T04:46:09+05:30 IST