తోటలను దున్నేస్తున్న రైతులు
ABN , First Publish Date - 2021-12-30T05:46:01+05:30 IST
అరటికి ధర లేకపోవడంతో రైతులు తోటలను దున్నేస్తున్నారు.
![తోటలను దున్నేస్తున్న రైతులు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921123012133637/12302021001552n35.jpg)
- రూ.6 లక్షలు నష్టం
చాగలమర్రి, డిసెంబరు 29: అరటికి ధర లేకపోవడంతో రైతులు తోటలను దున్నేస్తున్నారు. బుధవారం చాగలమర్రి గ్రామంలో కృష్ణ అనే కౌలు రైతు 6 ఎకరాల అరటితోటను దున్నేశారు. గత ఏడాది టన్ను అరటి రూ.18 వేలు పలికిందని, ఈ ఏడాది టన్ను రూ.1,200 కూడా పలకడం లేదని కౌలు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.6 లక్షల దాకా పెట్టుబడి రూపంలో నష్టం వాటిల్లింది. వైరస్ సోకి ధరలు లేక నష్టపోయామని, ప్రభుత్వమే పరిహారం అం దించి ఆదుకోవాలని కోరారు.