జిల్లాకు చేరిన పరిశీలకుడు
ABN , First Publish Date - 2021-02-06T05:47:47+05:30 IST
గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమితులైన వ్యయ పరిశీలకుడు ఐ.ఎఫ్.ఎస్ వినిత్ కుమార్ శుక్రవారం కర్నూలు జిల్లాకు చేరుకున్నారు.

కర్నూలు(కలెక్టరేట్), ఫిబ్రవరి 5: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమితులైన వ్యయ పరిశీలకుడు ఐ.ఎఫ్.ఎస్ వినిత్ కుమార్ శుక్రవారం కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీర పాండియన్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అంద జేశారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలపై ఆరా తీశారు.