25 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-01-20T05:39:16+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 5, 6 సెమిస్టర్‌ ఇన్‌స్టంట్‌ పరీక్షలు ఈ నెల 25 నుంచి నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు.

25 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

కర్నూలు(అర్బన్‌), జనవరి 19: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 5, 6 సెమిస్టర్‌ ఇన్‌స్టంట్‌ పరీక్షలు ఈ నెల 25 నుంచి నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. కర్నూలు డివిజన్‌ పరిధిలో కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, నంద్యాల డివిజన్‌ పరిఽధిలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఆదోని డివిజన్‌ పరిధిలో ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆయా కళాశాలల్లో ప్రిన్సిపాళ్ల వద్ద 21వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. ఎల్‌ఎల్‌బీ 3, 4, 6, 8 సెమిస్టరు పరీక్షలను కూడా 25వ తేదీ నుంచి నిర్వహిస్తామని పరీక్షల అధికారి తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ హాల్‌ టికెట్‌, కళాశాల స్టూడెంట్‌ ఐడీ కార్డుతో, మాస్కులు ధరించి పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.


Updated Date - 2021-01-20T05:39:16+05:30 IST