‘చిన్నసారు’పై వేటు
ABN , First Publish Date - 2021-02-27T05:40:49+05:30 IST
కోసిగి ఎంపీడీవో కార్యాల యంలో కాంట్రాక్టు కింద పని చేస్తున్న ఉద్యోగిపై వేటు పడింది.
- ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
కోసిగి, ఫిబ్రవరి 26: కోసిగి ఎంపీడీవో కార్యాల యంలో కాంట్రాక్టు కింద పని చేస్తున్న ఉద్యోగిపై వేటు పడింది. శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ‘చిన్నసారును కలిస్తేనే’ అన్న కథనానికి జిల్లా విజిలెన్స్ అధికారులు ఇన్చార్జి ఎంపీడీవో సూర్యనరసింహారెడ్డికి పోన్ చేసి ఆరా తీశారు. దీనిపై పూర్తి వివరాలు వారికి అందజేశానని ఇన్చార్జి ఎంపీడీవో తెలిపారు. గతంలోనే ఈ ఉద్యోగిపై ఫిర్యాదులు వచ్చాయని విజిలెన్స్ అధికారులు ఇన్చార్జి ఎంపీడీవోకు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు ఉద్యోగిని తొలగిస్తున్న ట్లు శనివారం నుంచి విధుల్లోకి రావద్దని చెప్పానని ఇన్చార్జి ఎంపీడీవో తెలిపారు.