గోశాల నిర్వహణ అద్భుతం
ABN , First Publish Date - 2021-01-20T05:57:13+05:30 IST
కర్నూలు నగర శివారులోని డోన్ రోడ్డులో ఉన్న గాయత్రీ గోశాలను త్రిదండి చినజీయర్ స్వామి మంగళవారం సందర్శించారు.

- జ్ఞాన మందిరాన్ని ప్రారంభించిన చిన జీయర్ స్వామి
కర్నూలు(అగ్రికల్చర్), జనవరి 19: కర్నూలు నగర శివారులోని డోన్ రోడ్డులో ఉన్న గాయత్రీ గోశాలను త్రిదండి చినజీయర్ స్వామి మంగళవారం సందర్శించారు. గోశాలలో నిర్మాణంలో ఉన్న దాన గోడౌన్ను ఆయన పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మించిన జ్ఞాన మందిరాన్ని చిన జీయర్ స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా గాయత్రీ గోశాల నిర్వహణ అద్భుతంగా ఉందని అన్నారు. గోశాల అభివృద్ధికి పారిశ్రామికవేత్త టీజీ భరత్ కృషిని అభినందించారు. ఈసందర్భంగా టీజీ భరత్ గోశాల అభివృధ్ధి గురించి చిన జీయర్ స్వామికి వివరించారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తన గ్రాంట్స్ నుంచి రూ.30 లక్షలు గోశాల అభివృద్ధికి ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో గోశాల అధ్యక్షుడు దౌమా జగదీ్షగుప్తా, గౌరవాధ్యక్షుడు టీఎస్ విజయకుమార్, కోశాధికారి ఇల్లూరు రాజ్యలక్ష్మి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.