ఐదు గడ్డి వాములు దగ్ధం
ABN , First Publish Date - 2021-05-18T05:38:53+05:30 IST
మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన ఐదుగురి రైతుల గడ్డి వాములు సోమవారం దగ్ధమయ్యాయి.
- రూ.3 లక్షల ఆస్తి నష్టం
ఉయ్యాలవాడ, మే 17: మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన ఐదుగురి రైతుల గడ్డి వాములు సోమవారం దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన నరసింహుడు, సన్న, రామక్రిష్ణ, రమణ, చిన్నపుల్లన్న పఽశువుల మేత కోసం రూ. 3 లక్షలు ఖర్చు చేసి వరి గడ్డి కొని వాములు వేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గడ్డి వాములు కాలిపోయాయి. ఆళ్లగడ్డ అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారని బాధిత రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.