ట్రాక్టర్ ఢీకొని బాలుడికి తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2021-07-09T05:23:16+05:30 IST
పత్తికొండ పట్టణంలోని వాసవీకళ్యాణమండపం సమీపంలో గురువారం సాయంత్రం ట్రాక్టర్ ఢీకొనడంతో మూడేళ్ల బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.

పత్తికొండ, జూలై 8: పత్తికొండ పట్టణంలోని వాసవీకళ్యాణమండపం సమీపంలో గురువారం సాయంత్రం ట్రాక్టర్ ఢీకొనడంతో మూడేళ్ల బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడి నుంచి చికిత్సనిమిత్తం కర్నూలుకు తరలించారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిని వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొందని స్థానికులు తెలిపారు. పోలీసులు విచారిస్తున్నారు.