ఘనంగా భగీరథ మహర్షి జయంతి
ABN , First Publish Date - 2021-05-20T04:56:55+05:30 IST
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని సంక్షేమ భవన్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), మే 19: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని సంక్షేమ భవన్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-3 (ఆసర, సంక్షేమం) శ్రీనివాసులు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శిరీష, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ గోవర్దన్, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
సి.బెళగల్: భగీరథ మహర్షి జయంతి వేడుకలను సి.బెళగల్లో నిర్వహించారు. పురోహితుడు శేఖర్ వేదమంత్రాలు పఠనం చెస్తు భక్తాదులచే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గ్రామంలో ఉప్పర సంఘం నాయకులు భగీరథ మహర్షి చిత్రపటానికి బియ్యం బేడలు సమర్పంచుకుని భక్తాదులచే నిరు పేదలైనవారికి అన్నదానం చేశారు. నల్లారెడ్డి, ఉప్పర సంఘం నాయకులు శంకరయ్య, శ్రీరాములు, టీడీపీ మండల కన్వీనర్ తిమ్మప్ప, ధనుంజయుడు. నాగరాజు, గోవింద్, శంకరమ్మ, లక్ష్మి ఉన్నారు.