బేతంచెర్లలో దొంగతనం

ABN , First Publish Date - 2021-04-13T05:23:00+05:30 IST

బేతంచెర్ల పట్టణంలోని కొత్తబస్టాండు సమీపంలోని నీళ్లట్యాంకు లైన్‌లో నివాసం ఉంటున్న షేక్‌ ఉస్మాన్‌బాషా అనే వ్యక్తి ఇంట్లో గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళలు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.1.20లక్షలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లారని బేతంచెర్ల సీఐ పీటీ కేశవరెడ్డి సోమవారం తెలిపారు.

బేతంచెర్లలో దొంగతనం

బేతంచెర్ల, ఏప్రిల్‌ 12: బేతంచెర్ల పట్టణంలోని కొత్తబస్టాండు సమీపంలోని నీళ్లట్యాంకు లైన్‌లో నివాసం ఉంటున్న షేక్‌ ఉస్మాన్‌బాషా అనే వ్యక్తి ఇంట్లో గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళలు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.1.20లక్షలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లారని బేతంచెర్ల సీఐ పీటీ కేశవరెడ్డి సోమవారం తెలిపారు. ఉస్మాన్‌బాషా తమ్ముడు మృతి చెందడంతో ఆదివారం రాత్రి ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో కలిసి కొత్తబస్టాండు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సమీపంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బీరువాలో ఉన్న ఆరు బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలు అపహరించుకొని వెళ్లారని, వాటి విలువ రూ.1.20లక్షలు ఉంటుందని, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కేశవరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-04-13T05:23:00+05:30 IST