కొనుగోలు చేసేవారు లేక..

ABN , First Publish Date - 2021-10-29T05:15:00+05:30 IST

మండలంలోని ఆలమూరు గ్రామంలో అరటితోటలు, అరటి గెలలను కొనుగోలు చేసేవారు ఎవరూ రాకపోవడంతో గురువారం రైతులు తోటలను డోజర్‌తో దున్నేశారు.

కొనుగోలు చేసేవారు లేక..
ఆలమూరులో అరటి తోటను డోజర్‌తో తొలగిస్తున్న రైతు

  1. డోజర్‌ తో అరటి తోట తొలగింపు 


రుద్రవరం, అక్టోబరు 28: మండలంలోని ఆలమూరు గ్రామంలో అరటితోటలు, అరటి గెలలను కొనుగోలు చేసేవారు ఎవరూ రాకపోవడంతో గురువారం రైతులు తోటలను డోజర్‌తో దున్నేశారు. గరుడయ్య, రమణయ్య అనే రైతులు 5 ఎకరాల్లో అరటి తోటను డోజర్‌తో దున్నెశారు. లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కిలో రూ.5 కూడా ధర లేకపోవడంతో పంటను దున్నేశామని అన్నారు. 


Updated Date - 2021-10-29T05:15:00+05:30 IST