మహిళపై అత్యాచారయత్నం
ABN , First Publish Date - 2021-06-23T05:03:29+05:30 IST
మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.
![మహిళపై అత్యాచారయత్నం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన బంధువులు
కోవెలకుంట్ల, జూన్ 22: మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఓ గ్రామంలో మహిళ జమ్ముగడ్డి కోసుకరావడానికి వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి ఆమెపై అత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకొని కొద్ది దూరంలో ఉన్న కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు తెలియజేసింది. వారు వచ్చి నిందితుడ్ని కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.