పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-07-24T05:39:05+05:30 IST
పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని టూ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

నంద్యాల (ఎడ్యుకేషన్), జూలై 23: పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని టూ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎస్బీఐ కాలనీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వెనుక స్థలంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం పోలీసులకు రావడంతో దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.51,280 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రమణ తెలిపారు.