గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు
ABN , First Publish Date - 2021-06-23T05:29:40+05:30 IST
దిన్నెదేవరపాడు సమీపంలో ఉన్న బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాలయ్య మంగళవారం ప్రకటనలో కోరారు.
![గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు(ఎడ్యుకేషన్), జూన్ 22: దిన్నెదేవరపాడు సమీపంలో ఉన్న బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాలయ్య మంగళవారం ప్రకటనలో కోరారు. కళాశాలలో సీఈసీలలో 40 సీట్లు, ఎంఈసీలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. ఇందులో 70 శాతం ఎస్సీలకు, 5 శాతం ఎస్టీలకు, 4 శాతం బీసీలకు, ఒక శాతం ఓబీసీకి రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. జూలై 7లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు. బాలికల గురకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి జూలై 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.