హనుమంత వాహనంపై అహోబిలేశుడు
ABN , First Publish Date - 2021-03-22T04:38:05+05:30 IST
అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఆదివారం ఎగువ అహోబి లంలో జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి, కిడాంబి లక్ష్మీన రసింహచార్యులను వేదపండితులు విశేషంగా అలంకరించారు.

దిగువన సూర్యప్రభ వాహన సేవ
ఆళ్లగడ్డ,
మార్చి 21: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా
జరుగుతున్నాయి. నాలుగో రోజు ఆదివారం ఎగువ అహోబి లంలో జ్వాలా నరసింహస్వామి,
శ్రీదేవి, భూదేవి, కిడాంబి లక్ష్మీన రసింహచార్యులను వేదపండితులు విశేషంగా
అలంకరించారు. పల్లకిపై ఆశీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఎగువ
అహోబిలంలోని జ్వాలా నరసింహస్వామికి ఉత్సవం, అభిషేకం నిర్వహించారు. అనంతరం
హనుమంత వాహనంపై ఊరేగించారు.
ఫ దిగువ అహోబిలంలో 46వ పీఠాధిపతి రంగనాథ
యతీంద్ర మహాదేశికన్ సమక్షంలో వేదపండితులు అభిషేకం, హంస వాహన సేవ,
సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. వేడుకల్లో ఈవో నరసయ్య, మఠం మేనేజర్
వైకుంఠస్వామి, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ పాల్గొన్నారు.
నేటి
వేడుకలు: ఎగువ అహోబిలంలో ఐదో రోజు సోమవారం లక్ష్మీనారసింహుడికి అభిషేకం,
శేషవాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు. దిగువ అహోబిలంలో స్వామి
వారికి యోగ నరసింహస్వామి వాహన సేవ, అభిషేకం, హనుమం తవాహన సేవ
నిర్వహిస్తారు.