కిలో అరటి రూ.2
ABN , First Publish Date - 2021-12-25T06:11:45+05:30 IST
మండలంలోని ఆలమూరు గ్రామంలో అరటి ధర పతనమైంది.
![కిలో అరటి రూ.2](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122512403656/12252021004127n9.jpg)
- ఎనిమిది ఎకరాల్లో దున్నేసిన రైతులు
రుద్రవరం, డిసెంబరు 24: మండలంలోని ఆలమూరు గ్రామంలో అరటి ధర పతనమైంది. కిలో రూ.2 కావడంతో అరటి తోటలను రైతు లు శుక్రవారం ట్రాక్టర్తో దున్నేశారు. గుర్రప్ప 2 ఎకరాలు, నీరుకట్టు గుర్రప్ప 2 ఎకరాలు, వెంకటరమణ 4 ఎకరాలు మొత్తం 8 ఎకరాలు దున్నేశారు. రూ.8 లక్షల పెట్టుబడి పుడమి పాలైంది.
కొనేవారు రాక దున్నేశా..
అరటిని కొనేవారు రాక 2 ఎకరాలు టాక్టర్తో దున్నేశా. కిలో రూ.2 రేటు పలకడంతో రూ.2 లక్షలు నష్టపోయా.
- గుర్రప్ప, రైతు, ఆలమూరు