ఓటరు నమోదుకు 463 దరఖాస్తులు
ABN , First Publish Date - 2021-11-22T05:14:26+05:30 IST
శ్రీశైలం నియోజక వర్గ పరిధిలోని శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలకు 463 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ ప్రకా్ష్బాబు పేర్కొన్నారు.

ఆత్మకూరు, నవంబరు 21: శ్రీశైలం నియోజక వర్గ పరిధిలోని శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలకు 463 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ ప్రకా్ష్బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆత్మకూరులోని మార్కెట్ యార్డు పోలింగ్ కేంద్రం వడ్లరామాపురం గ్రామాల్లో జరిగిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశైలం నియోజక వర్గంలోని 225 పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు.
ఓటరు నమోదు కేంద్రం పరిశీలన
బనగానపల్లె: మండలంలోని నందవరం గ్రామంలోని ఓటరు నమోదు కేంద్రాన్ని ఎలకో్ట్రరల్ రిజిస్ట్రేషన అధికారి, నంద్యాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య ఆదివారం తనిఖీ చేశారు. ఆయన వెంట బనగానపల్లె తహసీల్దారు ఆల్ఫ్రెడ్ ఉన్నారు. ఓటరు నమోదు దరఖాస్తులను ఆయన పరిశీలించారు.