విజయవాడలో టీడీపీ కార్యకర్తల నిరాహార దీక్ష
ABN , First Publish Date - 2021-01-26T18:40:13+05:30 IST
జైళ్లో టీఎన్ఎస్ఎఫ్ నాయకుల నిరాహార దీక్షకు మద్దతుగా కేశినేని భవన్లో టీడీపీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు.
విజయవాడ: జైళ్లో టీఎన్ఎస్ఎఫ్ నాయకుల నిరాహార దీక్షకు మద్దతుగా కేశినేని భవన్లో టీడీపీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు విజయ్ మాట్లాడుతూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్ధుల సమస్యలపై పోరాడుతుంటే వారిపై తప్పుడు కేసులు పెట్టడం సమంజసంకాదన్నారు. వైసీపీ నాయకులకు ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెబుతారని విజయ్ హెచ్చరించారు.