AP: చంద్రబాబు దీక్షకు రైతుల మద్దతు

ABN , First Publish Date - 2021-10-21T17:51:29+05:30 IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో రైతులు నిరసనకు దిగారు.

AP: చంద్రబాబు దీక్షకు రైతుల మద్దతు

విజయవాడ: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో రైతులు నిరసనకు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు రైతులు మద్దతు తెలిపారు. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. టీడీపీ కార్యాలయం, నేతలపై దాడిని ఖండించిన రైతు సంఘాలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సంఘం నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 

Updated Date - 2021-10-21T17:51:29+05:30 IST