స్వయంకృషికి నిదర్శనం వైవీబీ
ABN , First Publish Date - 2021-01-12T06:32:51+05:30 IST
స్వయంకృషికి నిదర్శనం వైవీబీ

ఉయ్యూరు, జనవరి 11 : సర్పంచ్ నుంచి ఎమ్మెల్సీ స్థాయికి చేరుకున్న వైవీబీ రాజ్రేంద్ర ప్రసాద్ స్వయంకృషికి నిలువెత్తు నిదర్శనమని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. రాజేంద్రప్రసాద్ రాజకీ యంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక 5వ వార్డులో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. క్రమశిక్షణ క లిగిన నాయకుడిగా పార్టీ కి విశేష సేవలు అందించారన్నారు. చేదుర్తిపాటి ప్రవీణ్, గురుమూర్తి, వీరపనేని శివరామ్, పరిమి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.