హిందూ ధర్మాన్ని కాపాడాలి
ABN , First Publish Date - 2021-03-03T06:26:36+05:30 IST
హిందూ ధర్మాన్ని కాపాడాలి
పెనమలూరు, మార్చి 2: హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని త్రిదండి చిన జీయర్స్వామిజీ అన్నారు. పెదపులిపాకలోని శ్రీ విజయ రాజరాజేశ్వరీ ఆలయ పంచమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో కోనేరు నిర్మాణానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ పద్ధతిలో దేవాలయ నిర్మాణం చేపట్టారని, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి వ్యవస్థాపకుడు వాసుదేవానందగిరి స్వామీజీ చాలా కృషి చేశారని కొనియాడారు. కోనేరు నిర్మాణానికి రూ. లక్ష విరాళం అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.