అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా...?: Ashok
ABN , First Publish Date - 2021-11-15T17:34:05+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషన్పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా అని ప్రశ్నించారు.
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా అని ప్రశ్నించారు. ఇవాళ ఎన్నికలు ఈసీ కాకుండా వైసీపీ నాయకులు నిర్వహిస్తున్నారని అన్నారు. బయటి నుంచి వచ్చి ఓటు వేసేవాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బయటి వ్యక్తుల వీడియోలను ఎన్నికల కమిషన్కు అందిస్తామని... లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఆ వీడియోలు సరిచూసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.