పక్క రాష్ట్రాలన్నీ ఉన్నతస్థానాల్లోకి చేరుతుంటే...ఏపీ మాత్రం: Lokesh
ABN , First Publish Date - 2021-09-03T16:25:41+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఖం చూసి, మంత్రి గౌతమ్ రెడ్డి మాయ మాటలు విని రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వారెవ్వరూ లేరని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఖం చూసి, మంత్రి గౌతమ్ రెడ్డి మాయ మాటలు విని రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వారెవ్వరూ లేరని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. చంద్రబాబు మెట్టు మెట్టు పేర్చుకుంటూ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడి మరీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో ఏపీని మొదటి 5 స్థానాల్లో నిలుపుతూ వచ్చారన్నారు. జగన్ రెడ్డి దరిద్ర పాదానికి అరాచకం తోడయ్యి ఇప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో మనం 13వ స్థానంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. పక్కన రాష్ట్రాలన్నీ, ఉన్నతస్థానంలోకి చేరుతుంటే...ఏపీ మాత్రం దిగజారిపోతోందని లోకేష్ అన్నారు.