స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రభుత్వ మద్దతు బాధాకరం: లోకేష్
ABN , First Publish Date - 2021-05-21T16:59:43+05:30 IST
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో వందలాది మంది ప్రాణ త్యాగాలతో విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ అన్నారు.

అమరావతి: విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో వందలాది మంది ప్రాణ త్యాగాలతో విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ అన్నారు. మాక్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం అనుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం అందుకు మద్దతు తెలపడం బాధాకరమన్నారు. దీనిపై తీర్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోకేష్ స్పష్టం చేశారు.