‘సజ్జల సభకు వర్తించని నిబంధనలు లోకేష్ పర్యటనకు వర్తిస్తాయా?’
ABN , First Publish Date - 2021-09-09T18:33:28+05:30 IST
మానవ హక్కులు, చట్టాల్ని ఉల్లంఘించే అధికారులు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు.
అమరావతి: మానవ హక్కులు, చట్టాల్ని ఉల్లంఘించే అధికారులు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. వేలాది మందితో సజ్జల సభకు వర్తించని కోవిడ్ నిబంధనలు.. లోకేష్ పర్యటనకు వర్తిస్తాయా అని ప్రశ్నించారు. జగన్ పాలనలో రెండేళ్లలో మహిళలపై 500 వరకు అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయన్నారు. వైసీపీ మంత్రులే మహిళలను లైంగికంగా హింసిస్తూ రాసలీలల్లో మునిగి తేలుతున్నారని కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు.