విశాఖపై ఎందుకీ కక్ష చెప్పండి?: దేవినేని
ABN , First Publish Date - 2021-06-16T17:06:52+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలనపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలనపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘విశాఖ ఉక్కుని కేసులకోసం తాకట్టుపెట్టారు. డేటా సెంటర్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. లులూని రద్దు చేసారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏపీకి గుడ్ బై లక్షల కోట్ల పెట్టుబడులు, వేలఉద్యోగాలు సముద్రంలో కలిపేశారు. భూములు వేలం వేస్తున్నారు. నాడు అమరావతి, నేడు విశాఖపై ఎందుకీ కక్ష చెప్పండి? వైయస్ జగన్’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.