గోవు పూజ ఓట్ల కోసం కాదా?: బోండా ఉమా
ABN , First Publish Date - 2021-01-15T15:15:39+05:30 IST
గోవు మాంసం తినేవాళ్ళు గోవు పూజ చేయడం ఓట్ల కోసం కాదా అని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: గోవు మాంసం తినేవాళ్ళు గోవు పూజ చేయడం ఓట్ల కోసం కాదా అని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాలయలపై, దేవత విగ్రహాలపై దాడులు చేయిస్తూ గోవులకు పూజలు చేస్తే పాపం పోద్దా అని ప్రశ్నించారు. చరిత్రలో ఎప్పుడూ కూడా దేవాలయలాపై ఇన్ని దాడులు జరిగినట్టు చూడలేదన్నారు. వైసీపీ మద్దతుతోనే ఇన్ని దాడులు జరిగాయని ఆరోపించారు. ఇన్ని దాడులు జరిగినా ఒక్కరిని అరెస్టు చేయలేదని... ఇది నిందితులకు వైసీపీ మద్దతు కాదా అని నిలదీశారు. పోలీసులు గత ప్రభుత్వంలో సమర్థవతంగా పని చేయలేదా?.. ఇప్పుడు ఎందుకు పనిచేయటంలేదని బోండా ఉమా ప్రశ్నించారు.